ఒక చేత్తో ఇస్తూ ... మరో చేత్తో లాక్కుంటున్నారు

ABN , First Publish Date - 2022-05-21T06:19:16+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలకులు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాక్కుంటున్నా రని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

ఒక చేత్తో ఇస్తూ ...  మరో చేత్తో లాక్కుంటున్నారు
సభలో మాట్లాడుతున్న కందికుంట వెంకటప్రసాద్‌

సోమందేపల్లి సభలో కందికుంట

హిందూపురంటౌన, మే 20: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలకులు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాక్కుంటున్నా రని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లాలోని సోమందేపల్లిలో నిర్వహించిన బాదుడేబాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కందికుంట మాట్లాడుతూ... రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. సీఎం జగన పేద ప్రజల నుంచి లాక్కోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక చేత్తో ఇస్తూ మరో ఇస్తూ లాక్కుంటున్నారన్నారు. సీఎం జగన పాలనలో ఏ వర్గం వారూ సంతో షంగా లేరన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో చేసిన శపథం నేరవేరాలంటే మనమంతా కష్టపడి ఆయనను సీఎంగా అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్రను అసెంబ్లీకి పంపిన చరిత్ర ఈ గడ్డకు ఉందన్నారు.


Updated Date - 2022-05-21T06:19:16+05:30 IST