ఒక చేత్తో ఇచ్చి.. రెండు చేతులతో లాగేసుకుంటున్నారు
ABN , First Publish Date - 2022-06-28T06:25:34+05:30 IST
వైసీపీ ప్రభుత్వం నవరత్నాల ముసుగులో ఒక చేత్తో ఇచ్చి... అధిక ధరలు, చార్జీల బాదుడుతో ప్ర జలను దోపిడీ చేసి, రెండు చేతులతో లాగేసుకుంటోందని టీడీపీ నా యకులు విమర్శించారు.
ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మోపిన వైసీపీ
‘బాదుడే బాదుడు’లో టీడీపీ నాయకులు
హిందూపురం టౌన, జూన 27: వైసీపీ ప్రభుత్వం నవరత్నాల ముసుగులో ఒక చేత్తో ఇచ్చి... అధిక ధరలు, చార్జీల బాదుడుతో ప్ర జలను దోపిడీ చేసి, రెండు చేతులతో లాగేసుకుంటోందని టీడీపీ నా యకులు విమర్శించారు. సోమవారం హిందూపురంతో పాటు మం డలంలోని బాలంపల్లిలో పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కొవ్వొత్తులతో నిరసన ర్యా లీ చేపట్టారు. ‘వద్దురా నాయనా... జగన పాలనా!’ అంటూ నినాదా లు చేశారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీ పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలపై ధరల మోతతో బాదుతోందన్నారు. పెంచిన విద్యుత చార్జీలు తగ్గించాలన్నారు. పె ట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. బాలంప ల్లి నిరసనలో కన్వీనర్ అశ్వర్థనారాయణరెడ్డి, ఆదినారాయణ, రవీంద్రరెడ్డి, అంజినరెడ్డి, హెచఎన రాము, చిన్నారెడ్డి, వెంకటరామిరెడ్డి, రామకృష్ణ, గోపాల్రెడ్డి, హిందూపురం 9వ వార్డు నిరసనలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామాంజనమ్మ, పరిమళ, నాగరాజు, కౌన్సిలర్ మం జుళ, విజయలక్ష్మీ, మంగేష్, ప్రెస్ వెంకటేశ, రవీంద్రనాయుడు, ప్ర సాద్, చంద్రమోహన, మురళి, నవీన, వెంకటరమణ, టైలర్ గంగాధర్, సునీల్, శివ, సుమోశీన, చిన్న, నజీర్, సురేష్ పాల్గొన్నారు.