గ్లాండ్ ఫార్మా రూ.5వేల కోట్ల ఐపీఓ
ABN , First Publish Date - 2020-10-27T05:47:18+05:30 IST
మరో ఫార్మా కం పెనీ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. హైదరాబాద్ కేంద్రం గా పనిచేసే గ్లాండ్ ఫార్మా కంపెనీ ఐపీఓ ద్వారా దాదాపు
సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మరో ఫార్మా కం పెనీ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. హైదరాబాద్ కేంద్రం గా పనిచేసే గ్లాండ్ ఫార్మా కంపెనీ ఐపీఓ ద్వారా దాదాపు రూ.5,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం ఈ ఏడాది జూలైలో కంపెనీ దాఖలు చేసిన ముసాయిదా పత్రాలపై సెబీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో కంపె నీ ఐపీఓకు మార్గం సుగమం అయింది.
చైనాకు చెందిన ఫోసన్ ఫార్మా కంపెనీకి గ్లాండ్ ఫార్మా ఈక్విటీలో 74 శాతం వాటా ఉంది. పాత ప్రమోటర్లతో పాటు ఫోసన్ ఫార్మా 3.4 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించబోతోంది. కొత్తగా రూ.1,250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా ఐపీఓ కింద జారీ చేస్తుంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను నిర్వహణ మూల ధనం, వ్యాపార విస్తరణ, ఇతర అవసరాల కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది.
1978లో పీవీఎన్ రాజు స్థాపించిన గ్లాండ్ ఫార్మా ఈక్విటీలో 74 శాతం వాటాను 2017లో చైనా కంపెనీ కొనుగోలు చేసిం ది. ఒక చైనా కంపెనీకి మెజారిటీ వాటా ఉన్న భారత కంపెనీ ఇంత పెద్ద ఐపీఓకు రావడం ఇదే మొదటిసారి.