ఘనంగా చిట్టినాయుడు వర్ధంతి

ABN , First Publish Date - 2021-12-26T05:46:14+05:30 IST

మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొట్టగుళ్లి చిట్టినాయుడు పదవ వర్ధంతిని కుటుంబ సభ్యులు, అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా చిట్టినాయుడు వర్ధంతి
చిట్టినాయుడు విగ్రహం వద్ద రగ్గులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, నరసింగరావు


పాడేరురూరల్‌, డిసెంబరు 25: మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొట్టగుళ్లి చిట్టినాయుడు పదవ వర్ధంతిని కుటుంబ సభ్యులు, అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లె క్స్‌ రోడ్డులోని స్వర్గీయ చిట్టినాయుడు విగ్రహానికి ఆయన కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్యే దంపతులు కె.భాగ్యలక్ష్మి, డాక్టర్‌ టి.నరసింగరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేశారు. అలాగే చిట్టినాయుడు కుమారుడు కొట్టగుళ్లి ఈశ్వరప్రసాద్‌ తండ్రి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలోని రోగులకు, మోదకొండమ్మ, కనకదుర్గమ్మ ఆలయాల వద్ద యాచకులకు ఈశ్వరప్రసాద్‌ పాలు, రొట్టెలు, పండ్లు, పేదలకు వస్తాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌.కె.కృష్ణారావు, కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, కొట్టగుళ్లి సుబ్బారావు, ట్రైకార్‌ చైర్మన్‌ సతకా బుల్లిబాబు, వైస్‌ ఎంపీపీ గంగపూజారి శివకుమార్‌, వర్తక సంఘం, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-26T05:46:14+05:30 IST