ఘనంగా సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2021-04-23T06:47:30+05:30 IST

సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవం గు రువారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవం
సభలో మాట్లాడుతున్న కృష్ణ

కోల్‌సిటీటౌన్‌, ఏప్రిల్‌ 22: సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవం గు రువారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐఎఫ్‌టీయూ కార్యాల యంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో న్యూడెమోక్రసీ పెద్దపల్లి డివిజన్‌ కార్యదర్శి ఈ.నరేష్‌ జెండావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ మాట్లాడుతూ సీపీఐ, సీపీఎం పార్టీలతో తెగతెంపులు చేసుకొని ఈదేశంలో బలప్రయోగం ద్వారానే నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించగలమ ని 1969 ఏప్రిల్‌22న మార్క్సిస్ట్‌ మహోపాధ్యాయుడు లెనిన్‌ జయంతి రోజున పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు. అనేక ప్రజాపోరాటాలు నిర్వహించి ప్రజలకు చిరస్మరణీ య విజయాలు సాధించిపెట్టిందన్నారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రజావ్యతిరేక విధా నాలపై పోరాటాలను కొనసాగించాలన్నారు. డివిజన్‌ నాయకులు తోకల రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇ.నరేష్‌, సత్యనారాయణరెడ్డి, అబేద్నేగో, దుర్గ య్య, వెంకన్న, కొమురయ్య,బుచ్చయ్య, లక్ష్మణ్‌, సంపత్‌, మల్లేశం, బాబన్న, యూసు ఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T06:47:30+05:30 IST