వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతం
ABN , First Publish Date - 2022-08-14T07:38:11+05:30 IST
జిల్లా కేంద్రంలోని హరిహరక్షేత్రంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవోపేతంగా నిర్వ హించారు.
నిర్మల్ కల్చర ల్, ఆగస్టు 13 : జిల్లా కేంద్రంలోని హరిహరక్షేత్రంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవోపేతంగా నిర్వ హించారు. ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్రెడ్డి, గౌతంరెడ్డి తదితర ప్రముఖులు వ్రత నిర్వహణలో పాల్గొనగా భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 108 మంది పీటలపై సత్యనారాయణ స్వామివ్రతం నిర్వహించారు. శ్రావణమాస ఉత్సవంలో ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహిస్తున్నామని గురుస్వామిమూర్తి తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని సామూహిక వ్రతాలు ఏర్పాటు చేశామని అన్నారు. కోశాధికారి సామల వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు. వ్రతం పూర్తయిన తరువాత భక్తులకు అన్నదానం చేశారు.