ఘనంగా ఎమ్మెల్యే స్వామి జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2021-12-05T05:28:20+05:30 IST
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి జన్మదిన వేడుకలు కొండపిలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఉదయం ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి, పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డపాటి యల్లమంద నాయుడు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
కొండపి, డిసెంబరు4: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి జన్మదిన వేడుకలు కొండపిలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఉదయం ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి, పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డపాటి యల్లమంద నాయుడు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కేక్, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు చాగంరెడ్డి నరసారెడ్డి, తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, రావిపాటి మధుసూదనరావు, చింతల వెంకట్రావు, నన్నూరి సుబ్బరామయ్య, గుండపనేని రామ్మూర్తి నాయుడు, తెలుగు యువత నాయకుడు మారెడ్డి అబ్బిరెడ్డి, కాయేషా, కూనంనేని శంకర్, ముసునూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే టీడీపీ బీసీ సెల్ నాయకుడు బత్తుల నారాయణ స్వామి హైదరాబాద్లో ఎమ్మెల్యే స్వామిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్కట్ చేశారు.
జరుగుమల్లిలో...
జరుగుమల్లిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే స్వామి జన్మదిన వేడుకలు శనివారం ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్చేశారు. స్థానిక హైస్కూల్ విద్యార్థులకు స్వీట్లు పంచారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, టీడీపీ నాయకుడు చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు పలుగ్రామాల నాయకులు పాల్గొన్నారు.
వల్లూరమ్మ ఆలయంలో...
ఎమ్మెల్యే స్వామి జన్మదినం సందర్భంగా వల్లూరు గుడిలో తెలుగు యువత ఆధ్వర్యంలో నాయకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు బెజవాడ వెంకటేశ్వర్లు, నాయకులు కాట్రగడ్డ అనిల్, కామని విజయకుమార్, ఆ పార్టీ ఎస్సీసెల్ నాయకుడు బ్రహ్మానందం పాల్గొన్నారు.
శింగరాయకొండలో..
సింగరాయకొండ : ఎమ్మెల్యే స్వామి జన్మదిన వేడుకలను శనివారం స్థానిక కందుకూరు రోడ్డు కూడలిలో మండల తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కందుకూరు రోడ్డులో ఉన్న దివంగత ఎన్టీఆర్, దామచర్ల విగ్రహాలకు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తరువాత కేకును కట్చేశారు. అనంతరం పేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు వేల్పుల సింగయ్య, చీమకుర్తి వెంకటేశ్వర్లు, కూనపురెడ్డి సుబ్బారావు, మందలపు గాంధీచౌదరి, ఇమ్మిడిశెట్టి రామారావు, సుదర్శి చంటి, పొనుగోటి కొండయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్మే స్వామిని శనివారం సింగరాయకొండకు చెందిన పలువురు టీడీపీ నేతలు కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుయువత అధ్యక్షుడు నారాయణస్వామి, దగ్గుమాటి రామకృష్ణ, మద్దసాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.