ఘనంగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి

ABN , First Publish Date - 2021-01-24T06:04:30+05:30 IST

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా శనివారం సిరిసిల్ల పట్టణంలోని సుభాస్‌నగర్‌లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి
నేతాజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు

 సిరిసిల్ల టౌన్‌, జనవరి 23:నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా శనివారం సిరిసిల్ల పట్టణంలోని సుభాస్‌నగర్‌లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ శంకరయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు  నర్సయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య,ఈఈ వెంకటశేషయ్య, వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాధికారి కార్యాలయం, శివనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఐఈవో సత్యవర్ధన్‌ రావు, ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ మోహన్‌  సుభాష్‌చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. 

సిరిసిల్ల రూరల్‌: పట్టణంలోని సుభాష్‌నగర్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి బీజేపీ పట్టణ కమిటీ అధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.  పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అడెపు రవీందర్‌, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

ఇల్లంతకుంట: మండలంలోని రేపాకలో నేతాజీ విగ్రహానికి సుతారి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  సంఘం అధ్యక్షుడు జేరిపోతుల కనుకయ్య, ఉపాధ్యక్షుడు తునికి శంకర్‌ పాల్గొన్నారు.

 ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నాయకులు దేవేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి తదితరులు సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ముస్తాబాద్‌: మండలం కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం,  బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు కదిరె స్వామిగౌడ్‌ ఆధ్వర్యంలో సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.  

 వేములవాడ:  వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేశ్‌, రూరల్‌ ఎంపీపీ బండ మల్లేశం, జిల్లా అఽధికార ప్రతినిధి గోపు మల్లేశం, పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు, ముప్పిడి శ్రీనివాస్‌, నందిపేట సుదర్శన్‌యాదవ్‌  పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతాజీ జయంతి  సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించకపోవడం విచారకరమని  ప్రతాప రామకృష్ణ అన్నారు.

కోనరావుపేట: మండలంలోని సుద్దాలలో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి  సర్పంచ్‌ దేవలక్ష్మి ఎంపీటీసీ మమత పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చందుర్తి: మర్రిగడ్డలో  యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జడ్పీటీసీ   నాగం కుమార్‌, సర్పంచ్‌ జలపతి నేతాజీ సుబాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  

Updated Date - 2021-01-24T06:04:30+05:30 IST