ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-05-29T05:09:26+05:30 IST
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ము ఖ్యమంత్రి, దివంగత తారక రామారావు శతజయంతి ఉత్సవాలు మహబూబ్ నగర్లో శని వారం ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
మహబూబ్నగర్ టౌన్, మే 28 : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ము ఖ్యమంత్రి, దివంగత తారక రామారావు శతజయంతి ఉత్సవాలు మహబూబ్ నగర్లో శని వారం ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వ హించిన ఈ వేడుకల్లో పలువురు నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించి కేక్కట్ చేసి స్వీట్లు పంపిణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజ కవ ర్గం సీనియర్ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, బాలప్ప మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఎప్పు డూ మర్చిపోని వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆర్ బాలప్ప, మాజీ ఎంపీ వెంకటయ్య, రాష్ట్ర కార్యదర్శి కాసీం, పట్టణ అ ధ్యక్షుడు చెన్నయ్య, తెలుగు యువత మండల అధ్యక్షుడు మురళి, కేశవులు, కునాల్ పాల్గొన్నారు.