ఘనంగా సదాశివ మాస్టారు జయంతి
ABN , First Publish Date - 2022-05-12T04:08:12+05:30 IST
పట్టణంలో బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సదాశివ మాస్టారు 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
కాగజ్నగర్, మే 11: పట్టణంలో బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సదాశివ మాస్టారు 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా కోనేరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కోనేరు వంశీ సదాశివ మాస్టారు విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాహితీరంగంలో తనదైన ముద్ర వేసుకున్న మహనీయుడు సదాశివ మాస్టారు అన్నారు. తెలుగు సాహితీ సదస్సు గౌరవ అధ్యక్షుడు నారాయణ గౌడ్ మాట్లాడుతూ ఒకవ్యక్తి దైనందిన జీవితం సంస్కృతిగా మారాలంటే సదాశివ వంటి సాహితీవేత్తలు మాత్రమే ఆధారమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగు సాహితీ సదస్సు ప్రధాన కార్యదర్శి పెండ్యాల కిషన్శర్మ, ఆర్గనైజింగ్కార్యదర్శి మధుకర్, ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, ఎంఈవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.