ఘనంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు
ABN , First Publish Date - 2022-01-23T04:56:13+05:30 IST
వేంపల్లె మండల నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు.
వేంపల్లె, జనవరి 22: వేంపల్లె మండల నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయీ బ్రాహ్మణ వీధిలోని త్యాగరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూజలు చేశారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రత్నం, గౌరవాధ్యక్షుడు రామకృష్ణ, ఉపాధ్యక్షులు శేఖర్, సిద్దయ్య, చండ్రాయుడు, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలోఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బ్యాండ్ వాయిధ్యాలతో త్యాగరాజ స్వామి చిత్రపటాన్ని గుర్రపు బండిలో గ్రామోత్సవం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్రెడ్డిలు త్యాగరాజస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయీ బ్రాహ్మ ణ సంఘం ప్రతినిధులు బాబు, సుధాకర్, రమేష్, చెన్నప్రసాద్, శ్రీను, నాగేం ద్ర, చిన్నగంగయ్య తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరులో...
మైదుకూరు, జనవరి 22 : ప్రముఖ వాగ్గేయ కారుడు త్యాగరాజ స్వామి వారి ఆరాధ నోత్సవాలను శనివారం మైదుకూరులో ఘనంగా నిర్వహించారు. నాయిబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయం నుంచి ఆయన నిలువెత్తు చిత్రంపటంతో ప్రత్యేక వాహనంలో పట్టణంలోని ప్రధాన రహదారిలో మంగళవాయిద్యాలతో ఊరేగింపు సాగింది.