కోలాహలంగా ఉత్తర గోగ్రహణం

ABN , First Publish Date - 2022-05-22T06:00:16+05:30 IST

సోమల మండలంలోని ఇరికిపెంట పంచాయతీ భారతంమిట్టలో మహాభారత ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉత్తర గోగ్రహణ ఘట్టం కోలాహలంగా సాగింది.

కోలాహలంగా ఉత్తర గోగ్రహణం
భారతంమిట్టలో విహరిస్తున్న పంచపాండవ వేషధారులు

సోమల, మే 21: మండలంలోని ఇరికిపెంట పంచాయతీ భారతంమిట్టలో మహాభారత ఉత్సవాల్లో  భాగంగా  శనివారం ఉత్తర గోగ్రహణ ఘట్టం   కోలాహలంగా సాగింది. ఉదయం ధర్మరాజుల ఆలయంలో పంచపాండవలు, ద్రౌపదిదేవి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా విరాటరాజు రాజ్యంలో పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండడం వేగుల ద్వారా దుర్యోధనుడు తెలుసుకుంటాడు. పాండవులు కూడా ఆ ప్రాంతంలోనే ఉంటారని దుర్యోధనుడు తన సైన్యంతో విరాటుని పశువులను తోలుకుని వెళ్తుంటే అర్జునుడు యుద్ధం చేసి వారి నుంచి పశువుల రక్షించి వెనక్కు తీసుకువస్తాడు. గోవులను తీసుకొచ్చిన అర్జునుడిని, ఉత్తర రాకుమారుడికి ప్రజలు ఘనస్వాగతం పలుకుతారు. ఈక్రమంలో  పంచపాండవుల విగ్రహాలను  పుష్ప పల్లకీలో అధిష్టింపజేసి భారతంమిట్ట, రాశెట్టివారిపల్లె, దాసరివాపల్లె, గన్నావారిపల్లె, వడ్డిపల్లెల్లో ఊరేంచారు. అలాగే గ్రామాల్లోని పశువులను పూలతో అలంకరించి ధర్మరాజుల ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈకార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్క గ్రామాల ప్రజలు భారతంమిట్టకు చేరుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఉభయదారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయంలో పూజలు జరిపి పశువుల యజమానులకు కానుకలు అందజేశారు. 


Updated Date - 2022-05-22T06:00:16+05:30 IST