వైభవంగా లక్ష్మీనరసింహుని కల్యాణం

ABN , First Publish Date - 2022-07-07T05:29:24+05:30 IST

మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీ నృసింహుని క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహుని నిత్యశాశ్వత కల్యాణం బుధవారం వైభవంగా నిర్వహించారు

వైభవంగా లక్ష్మీనరసింహుని కల్యాణం
కల్యాణ తంతు నిర్వహిస్తున్న వేదపండితులు

మఠంపల్లి, జూలై 6: మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీ నృసింహుని క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహుని నిత్యశాశ్వత కల్యాణం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత భక్తవత్సలుడికి నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. తర్వాత ఆలయ సంప్రదాయ ప్రకారం ఆర్జిత కైంకర్యాలు నిర్వహించారు. హోమాధికాలతో పాటు కల్యాణమూర్తులను పరిణయోత్సవ వేదికపైకి వేంచేయించి పుణ్యాహవాచనం చేశారు. అనంతరం యజ్ఞోపవీతధారణతో పాటు మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాలు కన్నుల పండువగా సాగగా, అనంతరం ఉత్సవమూర్తులకు గరుడోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:29:24+05:30 IST