హామీల అమలులో సీఎం కేసీఆర్ విఫలం
ABN , First Publish Date - 2020-12-02T06:01:14+05:30 IST
భువనగిరి రూరల్, డిసెంబరు 1:భువనగిరి రూరల్, డిసెంబరు 1:చ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయకుండా మాట తప్పారని జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ అన్నారు.
16న యాదగిరిగుట్ట నుంచి కలెక్టరేట్కు పాదయాత్ర: రవీందర్
భువనగిరి రూరల్, డిసెంబరు 1: భువనగిరి రూరల్, డిసెంబరు 1:భువనగిరి రూరల్, డిసెంబరు 1:చ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయకుండా మాట తప్పారని జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ అన్నారు. మంగళవారం భువనగిరిలో నిర్వహించిన గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. రెండో విడత సబ్సిడీ గొర్రెలను మంజూరులో విఫలం అయ్యారన్నారు. గొర్రెల షెడ్ల నిర్మాణానికి రూ.30లక్షల రుణాన్ని మంజూరు చేసి, యువతకు అర్థిక పరిపుష్టి కల్పించాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధ్దాప్య పింఛన్ రూ.5వేలు, ప్రమాదవశాత్తు మృతి చెందిన గొర్రెల కాపరికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న యాదగిరిగుట్ట నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో జీఎంపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి మల్లేశం, దయ్యాల నర్సింహా, నాయకులు కె.గోపాల్, బుడుమ శ్రీశైలం, శ్రీను, నగేష్, బీరప్ప, సత్యనారాయణ, జంగయ్య, వెంకటేష్, రాజు, బాల నర్సింహ, యాదగిరి, పాక జహంగీర్, కడారి కృష్ణ, గొర్రెల, మేకల పెంపకందారులు ఉన్నారు.