ప్రకాశం బ్యారేజి దిగువకు 36వేల క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-10-29T11:28:38+05:30 IST

ఎగువ జలాశయాల నుంచి నీటి విడుదలను తగ్గించడంతో బ్యారేజి వద్ద కృష్ణానది వరద ఉధృతి స్వల్పంగా కొనసాగుతోంది.

ప్రకాశం బ్యారేజి దిగువకు 36వేల క్యూసెక్కులు

తాడేపల్లి టౌన్‌, అక్టోబర్‌ 28: ఎగువ జలాశయాల నుంచి నీటి విడుదలను తగ్గించడంతో బ్యారేజి వద్ద కృష్ణానది వరద ఉధృతి స్వల్పంగా కొనసాగుతోంది. బుధవారం సాయంత్రానికి పులిచింతల ప్రాజెక్టు, బ్యారేజి ఎగువన ఉన్న వివిధ వాగుల నుంచి 61వేల క్యూసెక్కుల వరదనీరు బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద ఇన్‌ఫ్లోగా వచ్చి చేరిందని ఇరిగేషన్‌ జేఈ దినేష్‌ తెలిపారు. బ్యారేజి నుంచి దిగువకు 36,700 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదలచేస్తున్నారు. అలాగే తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 13వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ మొత్తం 70 గేట్లలో 50 గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు జేఈ  దినేష్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-29T11:28:38+05:30 IST