రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు

ABN , First Publish Date - 2020-10-30T09:54:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు

సంకెళ్ల బాధిత కుటుంబాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శ


మంగళగిరి క్రైమ్‌, అక్టోబరు 29: రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ వారి కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌర్జన్యంగా, కుట్రపూరితంగా రాజధానిని మార్చాలని అనుకుంటున్నారే తప్ప ప్రజాభిప్రాయాన్ని తీసుకోవటం లేదన్నారు. రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సహాయ కార్యదర్శి కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T09:54:50+05:30 IST