చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి గల్లంతు

ABN , First Publish Date - 2021-07-25T05:41:41+05:30 IST

కామారెడ్డి పెద్దచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైయ్యాడు. సీఐ మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని ఆర్‌బీ నగర్‌లో నివాసం ఉండే మంద రాజు(40) తన కూమారుడు రాహుల్‌తో కలసి చేపలు పట్టేందుకు వెళ్లాడు.

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి గల్లంతు

కామారెడ్డి, జూలై 24: కామారెడ్డి పెద్దచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైయ్యాడు. సీఐ మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని ఆర్‌బీ నగర్‌లో నివాసం ఉండే మంద రాజు(40) తన కూమారుడు రాహుల్‌తో కలసి చేపలు పట్టేందుకు వెళ్లాడు. మత్తడిలో దిగి చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఫిట్స్‌ వచ్చింది. దీంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. రాహుల్‌ చెరువు వద్దే ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. గజ ఈతగాళ్ల సహాయంతో రాజు మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-07-25T05:41:41+05:30 IST