శివరాత్రి వరకూ వైద్యానికి వెళ్లం!
ABN , First Publish Date - 2021-03-06T05:26:56+05:30 IST
ఆధునిక యుగంలోనూ ఆది వాసీలు మూఢనమ్మకాలను వీడడం లేదు. పాము కుట్టినా శివరాత్రి వరకు వైద్యానికి ఆస్పత్రికి వెళ్లబోమ ని, తాము పామును దైవంగా భావిస్తామని చెబుతున్నారు.
మూఢ నమ్మకాన్ని వీడని గిరిజనులు
పాము కుట్టినా... వైద్యం చేయించుకోని వైనం
వైద్యులు కౌన్సెలింగ్ చేసినా ఫలితం శూన్యమే!
ఉట్నూర్, మార్చి 5: ఆధునిక యుగంలోనూ ఆది వాసీలు మూఢనమ్మకాలను వీడడం లేదు. పాము కుట్టినా శివరాత్రి వరకు వైద్యానికి ఆస్పత్రికి వెళ్లబోమ ని, తాము పామును దైవంగా భావిస్తామని చెబుతున్నారు. ఉట్నూర్ మండలం హీరాపూర్కు చెందిన ఆదివాసీ బాలిక (14)కు రెండు నెలల క్రితం పాము కాటు వేయడంతో దంతన్పల్లి పీహెచ్సీకి తరలించి అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యం అం దించారు. అయితే కేవలం మూడు రోజుల పాటు వై ద్యం అందుకున్న గిరిజనులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ పాము కుట్టిన చోట గాయం పెరిగి కా లు వాపురావడంతో వైద్య సిబ్బంది బాలిక ఇంటి వద్దకే వెళ్లి వైద్యం చేస్తూ వస్తున్నారు. అయినా వాపు తగ్గకపోవడంతో దంతన్పల్లి డాక్టర్ అనురాధ ఆస్ప త్రికి రావాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. చివరకు శుక్రవారం ఏడీఎంహెచ్వో డాక్టర్ మనోహర్తో కలిసి డాక్టర్ కోవ అనురాధ మరోసారి బాలిక తండ్రి యశ్వంత్రావును ఒప్పించే ప్రయత్నం చేశా రు. తల్లిదండ్రులను కౌన్సెలింగ్ చేయగా శివరాత్రి పం డుగ సమీపిస్తున్నందున తాము పామును దైవంగా కొలుస్తామని పండుగ తర్వాత ఆస్పత్రికి వస్తామని తల్లిదండ్రులు పేర్కొనడంతో చేసేదేమీ లేక అధికారులు సైతం వెనుదిరిగారు.