Goa బీచ్లలో పోలీసుల నిఘా ముమ్మరం
ABN , First Publish Date - 2021-11-16T18:22:23+05:30 IST
టూరిజం సీజన్కు ముందు గోవా బీచ్లలో పోలీసుల నిఘా ముమ్మరం చేశారు...
పనాజీ (గోవా) : టూరిజం సీజన్కు ముందు గోవా బీచ్లలో పోలీసుల నిఘా ముమ్మరం చేశారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని వారిని మోసగించే, వేధించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు నార్త్ గోవా పోలీసు సూపరింటెండెంట్ శోభిత్ సక్సేనా చెప్పారు. గోవాలో కొవిడ్-19 వైరస్ తగ్గుముఖం పట్టాక బీచ్లకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.పర్యాటకులను వేధించే వారిపై కేసులు పెట్టి, పర్యాటకులకు సహాయం అందించడానికి గోవా బీచ్లలో పోలీసులను మోహరించినట్లు శోభిత్ చెప్పారు.
గోవాలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులపై కూడా పోలీసులు నిఘా ఉంచారు. గోవాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించేందుకు పూర్తిస్థాయి విదేశీయుల సర్వే కూడా నిర్వహించారు. విదేశీయులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన విదేశీయుల సంఖ్య కూడా పెరుగుతోందని ఎస్పీ చెప్పారు.