ఉప్పొంగిన శబరి, గోదావరి
ABN , First Publish Date - 2021-07-24T21:44:29+05:30 IST
ఉప్పొంగిన శబరి, గోదావరి
రాజమండ్రి: విలీన మండలాల్లో శబరి, గోదావరి నదులు ఉప్పొంగిపోయాయి. కూనవరం, చింతూరు, విఆర్ పురం మండలాల్లో వరదనీటి ప్రవాహంతో ముంపు లోతట్టు గ్రామాల ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు. పోలవరం కాఫర్ డామ్ కారణంగా ముంపు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. పునరావాస కేంద్రాలను అధికారులు సిద్ధంచేస్తున్నారు. పి.గన్నవరం గంటి పెదపూడి లంకలో రహదారికి గండిపడింది. దాంతో గంటి పెదపూడిలంక, బూరుగు లంక, అరిగెల వారిపేట, ఊడిమూడిలంక ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవలపైనే జనం ప్రయాణిస్తున్నారు.