శాంతించిన గోదావరి

ABN , First Publish Date - 2021-07-26T05:09:42+05:30 IST

శాంతించిన గోదావరి

శాంతించిన గోదావరి
భద్రాద్రి వద్ద గోదావరి ప్రవాహం

భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ

భద్రాచలం, జూలై 25: ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఐదు రోజులుగా భద్రాచలం వద్ద పెరుగుతూ వచ్చిన గోదావరి శాంతించింది. శనివారం రాత్రి 48.6 అడుగులకు చేరి కొద్దిసేపు నిలకడగా ఉన్న గోదావరి అనంతరం తగ్గుముఖం పట్టింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు 47.8అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను, మధ్యాహ్నం 2.30కి 42.9 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 6గంటలకు వరద 41.4అడుగులకు తగ్గింది. అయితే ఆదివారం కూడా స్నానఘట్టాలు నీట మునిగే ఉన్నాయి. పట్టణంలోని మురుగునీటిని, చప్టా దిగువ, విస్తా కాంప్లెక్స్‌, రామాలయ పరిసరాలు, అన్నదాన సత్రం ముందు భాగంలో బ్యాక్‌వాటర్‌ నిలిచిపోవడంతో నీటిపారుదల శాఖ అధికారులు మోటార్ల ద్వారా నీటిని గోదావరిలోకి లిఫ్ట్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-07-26T05:09:42+05:30 IST