పెరుగుతున్న గోదావరి

ABN , First Publish Date - 2022-07-08T01:55:18+05:30 IST

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి లో నీటి ప్రవాహం పెరుగుతోంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో ముంపు

పెరుగుతున్న గోదావరి

ధవళేశ్వరం: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి లో నీటి ప్రవాహం పెరుగుతోంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో ముంపు గ్రామాలైన కొండమొదలు నుంచి పోచమ్మగండి వరకు గోదావరి వరద నెమ్మదినెమ్మదిగా పెరుగుతోంది. గురువారం ఉదయం గండి పోచమ్మ విగ్రహం వరకు నీరు వచ్చి చేరింది.  


41 వేల క్యూసెక్కులు సముద్రంలోకి..

గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో పాటు దిగువన కాళేశ్వరం, ఇంద్రావతి నుంచి స్వల్ప ప్రవాహం గోదావరికి చేరుతూ ఉండడంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. దీంతో కాటన్‌ బ్యారేజ్‌ ధవళేశ్వరం ఆర్మ్‌లో 56 గేట్లు, ర్యాలి ఆర్మ్‌లో 31 గేట్లు, మద్దూర్‌ ఆర్మ్‌లో 15 గేట్లు, విజ్జేశ్వరం ఆర్మ్‌లో 28 గేట్లు 0.10 మీటర్ల మేర పైకి ఎత్తి 41,044 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 10.09 అడుగులుగా నమోదైంది.  

Updated Date - 2022-07-08T01:55:18+05:30 IST