స్పీడు పెంచిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు

ABN , First Publish Date - 2021-07-31T00:17:53+05:30 IST

గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పీడ్ పెంచింది. సమన్వయ కమిటీని నియమించింది. ఆగష్టు 3వతేదీన

స్పీడు పెంచిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు

రాజమండ్రి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పీడ్ పెంచింది. సమన్వయ కమిటీని నియమించింది. ఆగష్టు 3వతేదీన ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. తక్షణమే అనధికార ప్రాజెక్టులను నిలిపివేయాలని బోర్డు ఆదేశించింది. ఆరునెలల్లోగా అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలని స్పష్టం చేసింది. నదీ జలాల యాజమాన్య నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాలతో సమన్వయం చేసే పనిలో బోర్డు నిమగ్నమైంది. యాజమాన్య బోర్డు పరిధిని ప్రకటించే నాటికి బ్యారేజిలు, రిజర్వాయర్లు, కాలువలు, ఇతర యాజమాన్య నిర్వహణ కోసం నియమించిన శాశ్వత, పోరుగు సేవల సిబ్బంది మొత్తాన్ని బోర్డు పరిధిలోకి వస్తారని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గురువారం విడుదల చేసిన ఉత్తర్వులు కారణంగా తెలంగాణలో గోదావరిపై నిర్మించిన అనేక ప్రాజెక్టులకు గండం పోంచి ఉంది.

Updated Date - 2021-07-31T00:17:53+05:30 IST