పోలవరాన్ని పరిశీలించిన గోదావరి రివర్ బోర్డు
ABN , First Publish Date - 2022-03-17T02:03:39+05:30 IST
గోదావరి జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదావరి రివర్ బోర్డు బృందం బుధవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించింది.
పోలవరం: గోదావరి జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదావరి రివర్ బోర్డు బృందం బుధవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించింది. బోర్డు మెంబర్ సెక్రటరీ కుడ్యా ఆధ్వర్యంలో ఈ బృందం ప్రాజెక్టులో స్పిల్వే, కాపర్డ్యాం, జంట గుహలు, హెడ్ రెగ్యులేటర్, డెలివరీ చానల్ సమీపంలో ఉన్న దిగువ రెగ్యులేటర్లను పరిశీలించారు. ఈ బృందానికి ఏపీ హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ రత్నకుమార్, తెలంగాణ హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ కాశీ విశ్వనాథ్ సంబంధిత వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ రత్నకుమార్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ ఇప్పటి వరకూ 1340 టీఎంసీల నీటి నిల్వలను కలిగి ఉన్నాయని, ఎగువ నుంచి వచ్చే ఇన్ఫ్లో దిగువ రాష్ట్రాల నీటి వినియోగం తదితర అంశాలపై బృందం పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు.