భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ABN , First Publish Date - 2022-07-13T12:50:24+05:30 IST
భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. 50.80 అడుగుల నుంచి 50.90 అడుగులకు వరద పెరిగింది. మంగళవారం
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. 50.80 అడుగుల నుంచి 50.90 అడుగులకు వరద పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టిన గోదావరి నేడు కాస్త వరద పెరిగింది. అంతకుముందు 53.9 అడుగుల నుంచి 50.80 అడుగులకు గోదావరి వరద తగ్గింది. ఎగువన సమ్మక్క బ్యారేజ్ నుంచి వరద ఉధృతితో స్వల్పంగా గోదావరి వరద పెరుగుతుంది. భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.