TS News: అమ్మవారి విగ్రహం ధ్వంసం...ఇద్దరు ముస్లిం మహిళల అరెస్ట్
ABN , First Publish Date - 2022-09-27T18:14:45+05:30 IST
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ చింతలబస్తీలోని రాంలీల మైదానంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు. కాగా నిన్న... ఉదయం 9 గంటల సమయంలో ఇద్దరు ముస్లిం మహిళలు అమ్మవారి దగ్గర ఉన్న సింహాన్ని చాకుతో ధ్వంసం చేశారు. అడ్డుకున్న యువకునిపై కూడా చాకుతో దాడి చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళలను అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు.