ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2020-12-03T05:10:03+05:30 IST

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

శంషాబాద్‌రూరల్‌: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని  బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌  నుంచి  6ఈ-025 విమానంలో అక్బర్‌మోహినొద్దీన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో అతని వద్ద 299.190 గ్రాముల  బంగారం పట్టుబడింది. బంగారాన్ని కరిగించి కంప్యూటర్‌ మౌస్‌లా తయారు చేసి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-12-03T05:10:03+05:30 IST