గుంటూరు జిల్లా: 9 కేజీల బంగారంతో వ్యక్తి పరార్
ABN , First Publish Date - 2021-08-24T17:01:58+05:30 IST
మంగళగిరిలో బంగారం తయారుచేసే వ్యక్తి దాదాపు తొమ్మిది కేజీల బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు.
గుంటూరు జిల్లా: మంగళగిరిలో బంగారం తయారుచేసే వ్యక్తి దాదాపు తొమ్మిది కేజీల బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. రాజబత్తుల దిలీప్ కుమార్ అనే వ్యక్తి బంగారం వస్తువులు చేసే పనివాడు, వర్తకుల దగ్గర వస్తువులు చేసి ఇస్తానని నమ్మబలికి ముడి బంగారంతో పారిపోయినట్లు బాధితులు తెలిపారు. గత ఐదేళ్లుగా దాదాపు పది మంది వర్తకుల నుంచి బంగారం తీసుకొని నమ్మకంగా పని చేసి ఇస్తూ ఉండేవాడు. నిన్న తన వద్ద ఉన్న బంగారం సంచి ఎక్కడో పడిపోయిందని చెప్పి వెళ్ళాడని, మళ్లీ కనిపించలేదని బాధితులు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.