తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN , First Publish Date - 2022-04-29T00:15:17+05:30 IST
తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా విలువైన మెటల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర గురువారం రూ.442 తగ్గి రూ.51,010 వద్దకు చేరుకుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. క్రితం ట్రేడింగ్లో 10 గ్రాముల బంగారం రూ.51,452 వద్ద స్థిరపడింది. వెండి కూడా గత ట్రేడింగ్లో కిలో రూ.65,117 నుంచి రూ.950 తగ్గి రూ.64,167 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 1,885 డాలర్లు ఉండగా, వెండి ఔన్స్కు 23.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. COMEX వద్ద ఔన్సుకు USD 1,885 స్పాట్ గోల్డ్ ధరలతో బంగారం ధరలు బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. దీంతో బంగారం ధరలు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ దూకుడు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుందని అంచనాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ అన్నారు.