స్వర్ణశోభితం

ABN , First Publish Date - 2022-05-29T07:02:08+05:30 IST

వాడపల్లిలో స్వయంభూ క్షేత్రమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటు న్న భక్తులు స్వామి వారి వైభవానికి తమవంతు సమకారం అందిస్తూ వస్తున్నారు.

స్వర్ణశోభితం

రూ.2.5 కోట్లతో బంగారు వాకిలి నిర్మించేందుకు ముందుకు వస్తున్న దాతలు

ఆత్రేయపురం, మే 28: వాడపల్లిలో స్వయంభూ క్షేత్రమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటు న్న భక్తులు స్వామి వారి వైభవానికి తమవంతు సమకారం అందిస్తూ వస్తున్నారు. ఆభరణాలు, సేవలు, నిర్మాణాల విషయంలో కొందరు తమ దాతృత్వం చాటుకుంటుండగా, దేశం నలుమూలల నుంచి క్షేత్ర అభివృద్ధికి దాతలు తమవంతు సహ కారం అందిస్తున్నారు. ఇటీవల రూ.65 లక్షలతో ఓ అజ్ఞాత భక్తుడు స్వామివారికి బంగారు కిరీటం సమర్పించారు. అలాగే మూడేళ్ల కిందట ఒక భక్తుడు రూ.25 లక్షల వ్యయంతో బంగా రు  పాదాలను సమర్పించారు. కోట్లాది రూపాయల వ్యయంతో దాతలు స్వామివారికి ఆభరణాలు సమర్పించడంతో శ్రీవారు స్వర్ణశోభితుడై దర్శినమిస్తున్నారు. అలాగే దేశవిదేశాల్లో కొంత మంది దాతలు స్వామివారి ఆలయంలో బంగారు వాకిలి నిర్మిం చేందుకు ముందుకు వస్తున్నట్టు సమాచారం. రూ.2.50 కోట్ల వ్యయంతో బంగారు వాకిలి నిర్మాణానికి ప్రణాళిక రూపొంది స్తుండగా దాతలు ముందుకు వస్తున్నట్టు సమాచారం.



Updated Date - 2022-05-29T07:02:08+05:30 IST