చాణక్యనీతి: బంగారం మురికిలో ఉన్నా బయటకు తీయాలి!
ABN , First Publish Date - 2022-05-19T12:47:55+05:30 IST
మనిషి అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు...
మనిషి అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. కాలానుగుణంగా తమను తాము మార్చుకోనివారు ఇబ్బందులు పడతారని ఆచార్య చాణక్య తెలిపారు. చాణక్య నీతిలోని ఒక శ్లోకంలో ఆచార్య చాణక్యుడు విషం నుంచి కూడా అమృతాన్ని బయటకు తీయాలని చెప్పాడు.
అదేవిధంగా బంగారం మురికిలో పడివుంటే దానిని వెలికితీయాలి. ఇందులో ఎలాంటి సంకోచం ఉండకూడదు. దీనితో పాటు పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఉత్తమ జ్ఞానాన్ని పొంది, ఉన్నతస్థాయిని అందుకునేందుకు కృషి చేయాలి. ఈ విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. ఎందుకంటే దీనిలో తప్పేమీ లేదు. హీనస్థాయిలో జీవిస్తున్న యువతి గొప్ప లక్షణాలను కలిగి ఉండి.. మీకు ఏదైనా మంచి విషయం చెబితే దానిని స్వీకరించడానికి వెనుకాడకూడదని ఆచార్య చాణక్య తెలిపారు.