ఇండియన్ సైన్స్ టెక్నోలో జిల్లావాసికి గోల్డ్మెడల్
ABN , First Publish Date - 2021-03-02T05:26:13+05:30 IST
ఇండియన్ సైన్స్ టెక్నో-2021లో సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు జోగ చంద్రశేఖరరావు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
విజయనగరం రూరల్, మార్చి 1: ఇండియన్ సైన్స్ టెక్నో-2021లో సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు జోగ చంద్రశేఖరరావు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఫిబ్రవరి 11 నుంచి 22 వరకూ జాతీయస్థాయిలో ఆన్లైన్ పోటీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300 మంది భౌతికశాస్త్ర అధ్యాపకులు పాల్గొన్నారు. అయితే జిల్లావాసి చంద్రశేఖరరావు ‘సమాంతర కాంతి కిరణాల ఉత్పత్తి.. ప్రసారం’పై చేసిన ప్రయోగం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి గాను ఆయనకు గోల్డ్మెడల్ లభించింది. వినూత్న ప్రయోగంలో విజయం సాధించిన చంద్రశేఖరరావును డాక్టరు టి.రాధాకృష్ణ, సాలూరు ప్రభుత్వ డిగ్రీకళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.