రెజ్లింగ్లో యువతికి గోల్డ్మెడల్
ABN , First Publish Date - 2021-03-03T06:06:20+05:30 IST
మండలంలో జీగిరాం గ్రామానికి చెందిన యువతి రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో స్వర్ణపతకం సాధించింది.
సాలూరు రూరల్/సాలూరు, మార్చి 2: మండలంలో జీగిరాం గ్రామానికి చెందిన యువతి రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో స్వర్ణపతకం సాధించింది. గత నెల 27న కర్నూల్లో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో సత్తా చాటి అండర్ 23 జూనియర్ మహిళల విభాగంలో మంత్రి జాహ్నవి స్వర్ణపతకం సాధించారు. త్వరలో జరగనున్న జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఆమె పాల్గొనబోతున్నారు. విశాఖలోని ఆమె కోచ్ జ్యోతిర్మయి, తల్లిదండ్రులు మంత్రి గోపాల-పరమేశ్వరి, జీగిరాం, సాలూరువాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.