గోవిందుడి విమాన గోపురానికి బంగారు తాపడం

ABN , First Publish Date - 2021-07-25T12:04:25+05:30 IST

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో

గోవిందుడి విమాన గోపురానికి బంగారు తాపడం

  • రూ.32 కోట్ల విలువైన వంద కిలోల పసిడితో ఏర్పాటు: ఈవో


తిరుపతి : తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. ఆల యంలో శనివారం మధ్యా హ్నం జీయంగార్లు, వైఖానస ఆగమ సలహాదారు, అర్చకులు, అధికారులతో ఆయన సమీక్షించారు. తాపడం పనులకు ముందు బాలాల యం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జీయర్లు, ఆగమపండితులు తెలిపారు. ఆలయ కల్యాణ మండపంలో సెప్టెంబరు 13వ తేదీలోపు బాలాలయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 


అదేనెల 14 నుంచి బంగారు తాపడం పనులు ప్రారంభించి.. వచ్చే ఏడాది మేలోపు పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.32కోట్ల విలువైన వంద కిలోల బంగారాన్ని టీటీడీ ట్రెజరీ నుంచి తీసుకోవాలన్నారు. భక్తులకు మూలమూర్తి దర్శనం ఉంటుందని, కైంకర్యాలు మాత్రం బాలాలయంలో నిర్వహిస్తామన్నారు. పెద్ద, చిన్న జీయర్‌ స్వాములు, వైఖానస ఆగమ సలహాదారు విష్ణుభట్టాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసదీక్షితులు, జేఈవో సదాభార్గవి, సీఈ నాగేశ్వరరావు, ఎఫ్‌.ఎ.అండ్‌ సీఏవో బాలాజీ, ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవోలు రాజేంద్రుడు, గోవిందరాజులు, ఏఈవో రవికుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T12:04:25+05:30 IST