బంగారం ప్రియులకు గుడ్న్యూస్.. భారీగా పతనమైన పసిడి ధర
ABN , First Publish Date - 2021-09-18T01:17:09+05:30 IST
బంగారం ప్రియులకు ఇది శుభవార్తే. పసిడి ధరలు నేడు భారీగా పతనమయ్యాయి. దేశ రాజధాని
న్యూఢిల్లీ: బంగారం ప్రియులకు ఇది శుభవార్తే. పసిడి ధరలు నేడు భారీగా పతనమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 1,130 తగ్గింది. దీంతో పుత్తడి ధర అమాంతం రూ. 45,207కు పడిపోయింది. అంతకుముందు నాటి ట్రేడింగ్లో ఇది రూ. 46,226గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు పడిపోవడం వల్లే దేశీయంగా బంగారం ధరలు పతనమైనట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది.
మరోవైపు ఎప్పుడూ బంగారంతో పాటే పయనించే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండిపై రూ.708 తగ్గింది. ఫలితంగా వెండి ధర కిలో రూ. 60,183కి దిగొచ్చింది. క్రితం ట్రేడింగ్లో ఈ ధర రూ.60,891గా ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 47,620 వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి ధర రూ. 62,750గా ఉంది.