ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2022-07-07T05:46:31+05:30 IST
ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్రూరల్, జూలై 6: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బం గారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే 526 విమానంలో వస్తున్న ప్రయాణికురాలు బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. అఽధికారులు బ్యాగులు తనిఖీ చేయగా అందులో 1237 గ్రాముల బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.64.38లక్షలు ఉంటుందని తెలిపారు. గోల్డ్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.