శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం సీజ్

ABN , First Publish Date - 2022-04-07T02:06:23+05:30 IST

అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం సీజ్

హైదరాబాద్: అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో  సీజ్ చేశారు. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుని వద్ద ఉన్న బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు తన అండర్ వేర్‌లో బంగారాన్ని ఉంచి తరలిస్తున్నాడు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 478.520 గ్రాముల బంగారాన్ని పట్టుకుని సీజ్ చేశారు. పట్టుకున్న బంగారం విలువ 24.820 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికున్ని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2022-04-07T02:06:23+05:30 IST