ఉద్యోగం సాధిస్తేనే బంగారు భవిష్యత్
ABN , First Publish Date - 2022-07-07T05:49:19+05:30 IST
యువత కష్టపడి చదవి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే బంగారు భవిష్యత్ ఉంటుందని మంథని ఎమ్మెల్యే దుద్ది ళ్ళ శ్రీధర్బాబు అన్నారు.
- మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్బాబు
మంథని, జూలై 6 : యువత కష్టపడి చదవి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే బంగారు భవిష్యత్ ఉంటుందని మంథని ఎమ్మెల్యే దుద్ది ళ్ళ శ్రీధర్బాబు అన్నారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరు ద్యోగ యువతీయువకులకు శ్రీపాద ట్రస్టు ద్వారా పీజేఆర్ కోచింగ్ సెంటర్ ద్వారా రెండు నెలలుగా స్థానిక శివకిరణ్ గార్డెన్స్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారికి బుధవారం శ్రీధర్బాబు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖర్చుకు వెనుకాకుండా మంథని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఎక్కువ సంఖ్యలో పోలీసు, ఇత ర ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనే తపనతో మంథని, కాటారంలో హైదరాబాద్కు చెందిన పీజేఆర్ కోచింగ్ సెంటర్ ద్వారా యువతీయువకులకు శిక్షణ ఇప్పించా మన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని అభ్య ర్థులు ఉద్యోగాలు సాధిస్తే తాను, కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే వీలుంటుందన్నారు. వివిధ విభాగా ల్లో ప్రభుత్వ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి కోసం మంథని, కాటారం, సెంటనరీకాలనీ, మహదేవపూర్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నేతలు సెగ్గెం రాజేష్, శశిభూషణ్కా చే, వొడ్నాల శ్రీనివాస్, పెండ్రు రమాదేవీ-సురేష్రెడ్డి, చొప్పరి సదానందం, తొట్ల తిరుపతియాదవ్, గోటికార్ కిషన్జీ, చంద్రయ్య, నిహారిక, శేఖర్, సత్యం, వెంకన్న, శివ, గణపతి, హన్మంతులు పాల్గొన్నారు.