సకల దేవతలకు నెలవు గోమాత : జేసీ సిరి
ABN , First Publish Date - 2021-01-16T06:27:25+05:30 IST
సకల దేవతలకు నెలవు గోమాత అని జేసీ సిరి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 107 దేవాలయాల్లో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపురం టౌన్, జనవరి 15 :
సకల దేవతలకు నెలవు గోమాత అని జేసీ సిరి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 107 దేవాలయాల్లో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో గోపూజ చేసిన జేసీ సిరి మాట్లాడారు. గోమయాన్ని ఇంటిముందు కల్లాపిగా చల్లడంవల్ల అందులోని యాంటిబయటిక్స్ ఇంటిలోకి బ్యాక్టీరియా, వైరస్ వంటివి రాకుండా అడ్డుకుంటాన్నారు. గోమాతను రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆలయాలపై దాడులను అరికట్టడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో అన్నిమతాల ప్రార్థనామందిరాలను కాపాడేందుకు జిల్లా టా స్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, కార్యనిర్వహణాధికారిణి సుధారాణి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, ఇంజనీర్ రాంప్రసాద్, కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం ధర్మకర్తల మండలి ఛైర్మన్ వేణు, హోసూరు రామసుబ్రమణ్యం, ప్రకాష్, అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.