ఘనంగా గోండి ధర్మ గురు హీరాసుక జయంతి
ABN , First Publish Date - 2021-03-09T05:19:42+05:30 IST
ప్రధాన్ కుల గురువైన హీరాసుక జయంతిని మండలంలోని కేస్లాపూర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. హీరాసుక చిత్ర పట్టం వద్ద పూజలు నిర్వహించారు.
ఇంద్రవెల్లి, మార్చి 8: ప్రధాన్ కుల గురువైన హీరాసుక జయంతిని మండలంలోని కేస్లాపూర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. హీరాసుక చిత్ర పట్టం వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేస్లాపూర్ గ్రామ పటేల్ మెస్రం వెంకట్రావు మాట్లాడుతూ హీరాసుక చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కోసేరావు, ఉపాధ్యక్షుడు కోవా సురేష్, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకనాగనాథ్, కోవ మనోజ్, మడావి దీపిక్రాజ్, తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్: మండలంలోని జాతర్ల గ్రామంలో ప్రధాన్ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో గోండి ధర్మగురు హీరసుక జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన్ పురోహిత్ సంఘం అధ్యక్షుడు గేడం సుధామ్ మాట్లాడుతూ జాతి ఉన్నతి, వారి చరిత్రను గురించి రాబోయే తరాల వారికి తెలిసేవిధంగా కార్యక్రమాలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెందుర్ ఈశ్వర్. ప్రధాన్ పురోహిత్ సంఘం సభ్యులు మనోహర్, దత్త, నాగోరావు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.