సుపరిపాలన బీజేపీతోనే సాధ్యం
ABN , First Publish Date - 2022-05-12T06:58:40+05:30 IST
సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధి కార ప్రతినిధి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు.
బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్
ముధోల్, మే 11 : సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధి కార ప్రతినిధి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. బుధ వారం మండల కేంద్రమైన ముధోల్లో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి నేతృత్వంలో జరిగిన మండల స్థాయి ప్రశిక్షణా శిబిరంకు హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంను ఖూనీ చేస్తుందని ఆరోపించారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రంను ఆర్థికంగా దివాలా తీసి రాష్ట్రంను అప్పుల పాలు చేస్తుందని అన్నారు. నిరుద్యోగులకు, సామాన్య ప్రజానీకంకు తిప్పలు తప్పడం లేదని ఆరోపించారు. ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులుగా చే సేందుకు బీజేపీ కార్యకర్తలు కంకణ బద్ధులై ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయా లన్నారు. నియోజకవర్గంలో తానూర్, లోకేశ్వరం, బాసర, ముధోల్ మండల ముఖ్య కార్యకర్తలతో శిక్షణ తరగతుల సమావేశంలో పలు సలహాలు, సూచన లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపెల్లి గంగాధర్, జిల్లా శిక్షనిక్ ప్రముఖ్ మెడిసెమ్మె రాజు, జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, గంగాభూషణ్; జిల్లా కార్యదర్శి రమేష్, జిల్లా బీసీ మోర్చా అధ్యక్షులు ఎనుపోతుల మల్లేష్, మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.