ట్యాంక్బండ్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్...
ABN , First Publish Date - 2021-09-12T16:24:04+05:30 IST
ట్యాంక్బండ్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్...
హైదరాబాద్ సిటీ: నగరంలోని పలు ప్రాంతాల నుంచి ట్యాంక్బండ్ పరిసరాలకు గ్రేటర్ ఆర్టీసీ ప్రతి ఆదివారం ప్రత్యేక సర్వీసులు నడుపుతుందని గ్రేటర్ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకనటలో తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు బస్సులను ఆర్టీసీ నడపనుంది. ప్రయాణికులు తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేందుకు రాత్రి 10.30 గంటల వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ప్రతి ఆదివారం సాయంత్రం 5నుంచి రాత్రి 10 వరకు ట్యాంక్బండ్పై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆ రూట్లలో వెళ్లేబస్సులను ప్రత్యామ్నాయ రూట్లలో నడపనున్నారు. ట్రాఫిక్ అంక్షలతో సికింద్రాబాద్, రాణిగంజ్ మీదుగా వెళ్లేబస్సులు వయా బోట్స్ క్లబ్, మ్యారెట్ హోటల్, డీబీఆర్ మిల్, కట్టమైసమ్మ దేవాలయం నుంచి లిబర్టీ వైపుకు వెళ్లనున్నాయి. సెక్రటరేట్ మీదుగా వెళ్లేబస్సులు తెలుగుతల్లిఫ్లైఓవర్, డీబీఆర్మిల్స్, మ్యారెట్హోటల్, బైబిల్ హౌస్, రాణిగంజ్ ప్రాంతాల మీదుగా వెళ్తాయని, ప్రయాణికులకు అసౌకర్యం కల్గకుండా బస్సులు నడుపుతామని ఈడీ తెలిపారు.