హిందుస్థాన్ జింక్కు గుడ్బై
ABN , First Publish Date - 2022-05-26T10:06:29+05:30 IST
హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) కంపెనీ ఈక్విటీలో ఉన్న 29.5 వాటాను కూడా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) కంపెనీ ఈక్విటీలో ఉన్న 29.5 వాటాను కూడా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. ఈ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.38,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా. వేదాంత గ్రూప్ 2002-2003లో హెచ్జెడ్ఎల్ ఈక్విటీలో 44.92 శాతాన్ని ప్రభుత్వం నుంచి, మరో 20 శాతాన్ని ఓపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ 29.5 శాతం వాటా కొనే సంస్థ.. మరో 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. హెచ్జెడ్ఎల్ వాటా విక్రయానికి సంబంధించిన విధివిధానాలను త్వరలో దీపమ్ ఖరారు చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.