పట్టాలు తప్పిన goods train...నిలిచిన రైళ్ల రాకపోకలు
ABN , First Publish Date - 2022-07-18T16:53:39+05:30 IST
గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్లో గూడ్స్ రైలుకు చెందిన 12 కోచ్లు పట్టాలు తప్పాయి....
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్లో గూడ్స్ రైలుకు చెందిన 12 కోచ్లు పట్టాలు తప్పాయి.గూడ్స్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు చెప్పారు.గుజరాత్ రాష్ట్రంలోని మంగళ్ మోడీ- లింఖేడా మధ్య రత్లాం రైల్వే డివిజన్లో సోమవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాహోద్ జిల్లాలో మంగళ్ మహుడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ముంబై-ఢిల్లీ మధ్య రైలు రాకపోకలు నిలిచిపోయాయి. ఘటన జరిగిన వెంటనే రైల్వే శాఖ ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.పట్టాలు తప్పడంతో రైలు పట్టాలతోపాటు రైలు కేబుల్స్ కూడా దెబ్బతిన్నాయి.దీని వల్ల ముంబయి- ఢిల్లీ మార్గంలో 20 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.