గోరంట్ల మాధవ్ వస్తున్నాడని..!
ABN , First Publish Date - 2022-08-14T06:07:54+05:30 IST
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆదివారం జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు మొదలు పెట్టారు.
అనంతపురం క్రైం, ఆగస్టు 13: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆదివారం జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులను శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొందరికి నోటీసులు ఇచ్చారు. న్యూడ్ వీడియో వివాదం తరువాత తొలిసారిగా మాధవ్ అనంతపురం నగరానికి వస్తున్నారు. దీంతో త్రీ టౌన పోలీసులు తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్పను అరెస్టు చేశారు. టీఎనఎ్సఎ్ఫ నాయకుడు లక్ష్మీనరసింహను వనటౌన పోలీసులు అరెస్ట్ చేశారు. మాధవ్ పర్యటనను అడ్డుకోకూడదని టీడీపీ నాయకులకు నోటీసులు అందజేశారు. నాలుగో పట్టణ పోలీసులు చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకా్షనాయుడుకు, టూటౌన పోలీసులు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణకు నోటీసులు అందజేశారు.