Governor: జాతీయ పతాకాలు ఎగురేయండి
ABN , First Publish Date - 2022-08-09T16:58:24+05:30 IST
దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాలు ఎగురవేయాలని గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi)
- గవర్నర్ ఆర్ఎన్ రవి
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 8: దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాలు ఎగురవేయాలని గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజ్భవన్(Raj Bhavan) సోమవారం విడుదల చేసిన ప్రకనటలో, దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన సమరయోధులకు అంజలి ఘటించేలా, పిల్లల్లో స్వాతంత్య్ర స్ఫూర్తి నింపేలా ‘ఘర్ ఘర్ తిరంగా (ఇల్లం తోరుం మూవర్ణ కొడి) పేరిట ఈ నెల 13 నుంచి 15వ తేది వరకు జాతీయ పతకాలు ఎగురవేయాలని గవర్నర్ సూచించారు.