Delhi వెళ్లిన గవర్నర్
ABN , First Publish Date - 2022-06-14T13:28:24+05:30 IST
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆకస్మికంగా సోమవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. బుధవారం ఆయన నగరానికి తిరిగిరానున్నారు. రెండు రోజులపాటు
చెన్నై, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆకస్మికంగా సోమవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. బుధవారం ఆయన నగరానికి తిరిగిరానున్నారు. రెండు రోజులపాటు ఆయన ఢిల్లీలో బసచేయనుండటంతో ఆ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలుసుకుంటారని తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఆయన బీహార్ రాజధాని పాట్నాకు వెళ్ళి అక్కడి జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం మళ్ళీ ఢిల్లీకి చేరుకుంటారు. బుధవారం నగరానికి చేరుకుంటారు. గవర్నర్ రెండు రోజులు ఢిల్లీలో బసచేసే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలుసుకుని రాష్ట్ర పరిస్థితులపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది.