గవర్నర్‌తో Annamalai భేటీ

ABN , First Publish Date - 2022-07-22T13:55:23+05:30 IST

నకిలీ పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అడిషనల్‌ డీజీపీ డేవిడ్‌సన్‌ దేవాశీర్వాదాన్ని డిస్మిస్‌ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర

గవర్నర్‌తో Annamalai భేటీ

                             - ఏడీజీపీని డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌


చెన్నై, జూలై 21 (ఆంధ్రజ్యోతి): నకిలీ పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అడిషనల్‌ డీజీపీ డేవిడ్‌సన్‌ దేవాశీర్వాదాన్ని డిస్మిస్‌ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో నకిలీ చిరునామాలతో పాస్‌పోర్టులు జారీ చేస్తుండటంతో దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని, వైమానిక దళం ఇంటి చిరునామాతో నకిలీ పాస్‌పోర్టులు జారీ అయ్యాయని అన్నామలై ఆ వినతిపత్రంలో ఆరోపించారు. ఇక కళ్లకుర్చి విద్యార్థిని మృతి కేసులో ఇంటెలిజెన్స్‌ విభాగం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఈ పరిస్థితుల్లో ఆ విభాగం ఏడీజీపీని డిస్మిస్‌ చేయాలని కోరారు. అన్నామలైతోపాటు పార్టీ ప్రముఖులు కేపీ రామలింగం, వీపీ దురైసామి, మురుగానందం, కాత్యాయని, శరవణన్‌ తదితరులు గవర్నర్‌ను కలిసినవారిలో ఉన్నారు.

Updated Date - 2022-07-22T13:55:23+05:30 IST