రెండు రాష్ట్రాలు.. నాకు ఇద్దరు పిల్లలు

ABN , First Publish Date - 2022-01-28T14:19:30+05:30 IST

రెండు రాష్ట్రాలు నాకు ఇద్దరు పిల్లలులాంటివని, పిల్లలకు న్యాయం చేయాలని ఎంత శ్రమ అయినా పనిచేస్తున్నానని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తెలిపారు. తెలంగాణా గవర్నర్‌గా వ్యవహరిస్తున్న తమిళిసై

రెండు రాష్ట్రాలు.. నాకు ఇద్దరు పిల్లలు

                 - పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌


ప్యారీస్‌(చెన్నై): రెండు రాష్ట్రాలు నాకు ఇద్దరు పిల్లలులాంటివని, పిల్లలకు న్యాయం చేయాలని ఎంత శ్రమ అయినా పనిచేస్తున్నానని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తెలిపారు. తెలంగాణా గవర్నర్‌గా వ్యవహరిస్తున్న తమిళిసై పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఇరు రాష్ట్రాల్లో గవర్నర్‌ పాల్గొని జెండావిష్కరణలో పాల్గొనడాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పు పుడుతున్నాయి. ఈ క్రమంలో, పుదుఐలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకల్లో పాల్గొని జెండా ఎగురవేయం రికార్డుగా భావించడం లేదని, ఇరు రాష్ట్రాల ప్రజలను గౌరవిస్తున్నానని, అందుకే రెండు రాష్ట్రాల వేడుకల్లో పాల్గొన్నానని తెలిపారు. ఈ వ్యవహారంపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఓ విలేఖరి రాష్ట్రపతి పదవికి అవ కాశం ఉందా? అని ప్రశ్నించగా, గవర్నర్‌ తమిళిసై చేతులు జోడించి చిరునవ్వుతో ఉండిపోయారు.

Updated Date - 2022-01-28T14:19:30+05:30 IST