హజ్ యాత్రికులకు ప్రభుత్వ సహకారం
ABN , First Publish Date - 2022-05-22T06:54:01+05:30 IST
హజ్ యాత్రికులకు ప్రభుత్వం అన్నిరకాల స హకారం అందిస్తుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
నిర్మల్ కల్చరల్, మే 21 : హజ్ యాత్రికులకు ప్రభుత్వం అన్నిరకాల స హకారం అందిస్తుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం ఆయన నిర్మల్లో నిర్వహిస్తున్న హజ్యాత్ర శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ... హజ్యాత్ర ఎంతో పవిత్రమైందని అన్నారు. ఆర్థిక స్తోమత లేని వారికి సైతం ప్రభుత్వం యాత్రకు వెళ్లే ఏర్పాట్లు కల్పిస్తున్నా మని అన్నారు. హజ్ యాత్రకు వెళ్లేందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. యాత్ర పట్ల శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. నిర్మల్లో హజ్ హౌస్ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పాల్గొన్నారు. మతపెద్దలు జియారత్ ఈ మదీనా యాత్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, హజ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు నజీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.